Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఇరాన్, గల్ఫ్ దేశాల్లో అత్యవసరమైతే తప్ప తెలుగువారు బయటకు రావొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్, గల్ఫ్ దేశాల్లో అత్యవసరమైతే తప్ప తెలుగువారు బయటకు రావొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారు అత్యవసరం తప్ప బయటకు రావొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైతే కేంద్రంతో కలిసి సురక్షితంగా స్వదేశానికి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచడంతో పాటు, ప్రాంతీయ అస్థిరత పెరిగే ప్రమాదాలు నెలకొని ఉన్నాయి.

న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం: సీజేఐ

న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం: సీజేఐ

న్యాయం అందించడమనేది కేవలం న్యాయమూర్తుల బాధ్యత మాత్రమే కాదని అందులో బార్ (న్యాయవాదులు) పాత్ర అత్యంత కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఆదివారం తిరుపతి జిల్లాలో ప్రతిపాదిత 16 కోర్టు భవనాల నూతన సముదాయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నిర్మాణ స్థలానికి చేరుకున్న ఆయనకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ తో ఘనస్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా జరిగిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

పుదుచ్చేరిని మెడికల్ హబ్ గా చేస్తాం ప్రధాని మోడీ

పుదుచ్చేరిని మెడికల్ హబ్ గా చేస్తాం ప్రధాని మోడీ

పుదుచ్చేరిని ‘మెడికల్ హబ్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటనలు చేశారు. ఆదివారం పుదుచ్చేరిలో నిర్వహించిన ప్రజా సభలో ఆయన రూ.1,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించారు.

బీజేపీ అధికారానికి కౌంట్ డౌన్ ప్రారంభం: కేజ్రీవాల్

బీజేపీ అధికారానికి కౌంట్ డౌన్ ప్రారంభం: కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టు నుంచి విముక్తి పొందిన 48 గంటలకే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పార్టీ ర్యాలీలో మాట్లాడుతూ ‘బీజేపీ అధికారానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది’ అని ప్రకటించారు.

ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లకు జీఎస్టీ వసూళ్లు

ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లకు జీఎస్టీ వసూళ్లు

ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు 8.1 శాతం పెరిగి రూ.1.83 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. దిగుమతులపై ఆదాయం పెరగడం, దేశీయ విక్రయాల్లో మెరుగుదల దీనికి కారణమని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.

నేడు ఢిల్లీలో పింక్ మొబిలిటీ కార్డ్ ప్రారంభం

నేడు ఢిల్లీలో పింక్ మొబిలిటీ కార్డ్ ప్రారంభం

ఢిల్లీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పింక్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)ను సోమవారం ప్రారంభించనున్నారు

కర్నూలు నర్సింగ్ కాలేజీలో కాశ్మీరీ విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు: స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్

కర్నూలు నర్సింగ్ కాలేజీలో కాశ్మీరీ విద్యార్థులపై వేధింపుల ఆరోపణలు: స్పందించిన కాలేజీ ప్రిన్సిపాల్

కర్నూలులోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న కాశ్మీరీ విద్యార్థినుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. తమను కళాశాల యాజమాన్యం వేధిస్తోందని, ముఖ్యంగా రంజాన్ మాసంలో కనీస భోజన వసతులు కల్పించడం లేదని ఆరోపిస్తూ 'జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసింది. కళాశాలలో తమ పట్ల వివక్ష చూపుతున్నారని మతపరమైన ఆంక్షలు విధిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర సీఎం మాణిక్ సాహా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర సీఎం మాణిక్ సాహా

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాలను పాటిస్తూ, సామాన్య భక్తులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు గంటకు పైగా ఆలయంలో గడిపిన ముఖ్యమంత్రి గర్భాలయంలోని శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: వైఎస్ షర్మిల

యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: వైఎస్ షర్మిల

రాష్ట్రంలో అమలవుతున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్ (యూహెచ్ సీ)పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూ.2.5 లక్షల ఆరోగ్య బీమా పేరుతో ప్రభుత్వం ప్రజలను పచ్చి మోసం చేస్తోందని ఆమె ఆరోపించారు. పేదల పాలిట సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ముఖ్యమంత్రిని కలిసిన నూతన సీఎస్ జి. సాయి ప్రసాద్

ముఖ్యమంత్రిని కలిసిన నూతన సీఎస్ జి. సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా బాధ్యతలు చేపట్టిన జి.సాయి ప్రసాద్ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో సీఎస్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా శనివారం కె. విజయానంద్ నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయి ప్రసాద్ సిఎంతో భేటీ కావడం ఇదే తొలిసారి.

ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలి: ఎంపీ అసదుద్దీన్

ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలి: ఎంపీ అసదుద్దీన్

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరిపిన సైనిక దాడులను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ యుద్ధాన్ని ఆపడంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓవైసీ మాట్లాడుతూ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేశారు.

పెండింగ్ కేసులను పరిష్కరించండి: హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తీక్

పెండింగ్ కేసులను పరిష్కరించండి: హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తీక్

న్యాయస్థానాల్లో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ జుడీషియల్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా పరిపాలనా న్యాయమూర్తి హోదాలో ఆయన శనివారం జిల్లా కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి సహా ఇతర న్యాయమూర్తులు ఆయనకు స్వాగతం పలికారు.

కుమారుడి వివాహానికి సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన భట్టి విక్రమార్క

కుమారుడి వివాహానికి సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన భట్టి విక్రమార్క

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలసి తనయుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి ఆహ్వానించారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో వివాహం జరగనుంది.

తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమ‌ర్శ‌లు

తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమ‌ర్శ‌లు

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ–2026 నివేదికపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే కుట్ర అని ఆరోపించారు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని, పేద విద్యార్థులకు నష్టమని పేర్కొంటూ అమలు చేస్తే వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.

లైసెన్స్‌డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి హరీష్ రావు

లైసెన్స్‌డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాయమాటలు నమ్మి ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలను వదిలి వచ్చిన 6,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆయన ఆరోపించారు. ఆదివారం సిద్దిపేటలో తనను కలిసిన సర్వేయర్ల గోడును విన్న అనంతరం ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

బస్తీ దవాఖానాలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

బస్తీ దవాఖానాలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

క్షేత్రస్థాయిలో సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా హైద‌రాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి బీజేఆర్ నగర్ బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు ఎలా అందుతున్నాయో స్వయంగా తెలుసుకునేందుకు ఆమె ఈ పర్యటన చేపట్టారు.

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: మంత్రి పొంగులేటి

మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: మంత్రి పొంగులేటి

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని మంత్రి పొంగులేటి తెలిపారు. రూ.251 కోట్ల శాశ్వత పనుల్లో 95% పూర్తయ్యాయని చెప్పారు. జంపన్న వాగుకు గోదావరి జలాలు తీసుకురావడం, చెక్‌డ్యాంల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

పాతబస్తీలో రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్ పనులు

పాతబస్తీలో రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్ పనులు

పాతబస్తీ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి, డీ-సిల్టింగ్ పనులను ఆధునిక రోబోటిక్ టెక్నాలజీతో నిర్వహించే దిశగా జలమండలి ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జేఎండీ మయాంక్ మిట్టల్ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఖమేనీ హతం.. రణరంగంగా మారిన మధ్యప్రాచ్యం

ఖమేనీ హతం.. రణరంగంగా మారిన మధ్యప్రాచ్యం

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడి వైమానిక దాడిలో హతమార్చడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం ఉదయం ఇజ్రాయెల్‌తో పాటు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం నడిబొడ్డున ఉన్న కీలక లక్ష్యాలపై భారీ పేలుళ్లకు పాల్పడింది.

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులకు హై అలర్ట్‌

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులకు హై అలర్ట్‌

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో లెబనాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఆదివారం కీలక హెచ్చరికలు జారీ చేశాయి.

ఖమేనీ హత్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే: పుతిన్‌

ఖమేనీ హత్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే: పుతిన్‌

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడి వైమానిక దాడిలో హతమార్చడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణం అంతర్జాతీయ చట్టాలను, మానవ నైతిక విలువలను తుంగలో తొక్కడమేనని ఆయన అభివర్ణించారు.

కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో 10 మంది మృతి!

కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై దాడి.. కాల్పుల్లో 10 మంది మృతి!

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యతో పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. కరాచీ నగరంలోని అమెరికా కాన్సులేట్‌ ముట్టడికి నిరసనకారులు ప్రయత్నించడంతో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరెజా అరాఫీ

ఇరాన్‌ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీరెజా అరాఫీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిగా అయతొల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆదివారం నియమించింది.

హోర్ముజ్ మూసినా.. రెండు వారాలు ముడి చమురుకు ఢోకాలేదు

హోర్ముజ్ మూసినా.. రెండు వారాలు ముడి చమురుకు ఢోకాలేదు

ఇరాన్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి మూసివేత జరిగినా, ఇప్పటికిప్పుడు భారత్‌కు చమురు సరఫరాలో అంతరాయం ఉండే అవకాశం తక్కువగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు..నేడు జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు..నేడు జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం కావడం, తదనంతర దాడుల నేపథ్యంలో పశ్చిమ ఆసియాలోని ఏడు దేశాల్లో సోమవారం (మార్చి 2) జరగాల్సిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ఒక అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది.

ఉత్తర సముద్రంలో రష్యా చమురు నౌకను సీజ్ చేసిన బెల్జియం

ఉత్తర సముద్రంలో రష్యా చమురు నౌకను సీజ్ చేసిన బెల్జియం

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను చాటుమాటుగా ఉల్లంఘిస్తున్న 'షాడో ఫ్లీట్'కు చెందిన ఒక భారీ చమురు నౌకను బెల్జియం రక్షణ దళాలు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నాయి.

14మంది మావోయిస్టుల లొంగుబాటు

14మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ ఉద్యమానికి మరో భారీ దెబ్బ. వెటరన్ నక్సల్ నాయకుడు వికాస్ తో పాటు 14 మంది మావోయిస్టులు (మొత్తం 15 మంది) ఆదివారం మహాసముంద్ జిల్లాలో ఆయుధాలు వదిలి పోలీసుల ముందు లొంగిపోయారు.

తెలంగాణ ప్రభుత్వ ‘99’ రోజుల ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణ ప్రభుత్వ ‘99’ రోజుల ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు మరింత సమర్థవంతంగా చేరేలా ప్రత్యేకంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

భయానక అనుభవం… కానీ ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం: పీవీ.సింధు

భయానక అనుభవం… కానీ ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం: పీవీ.సింధు

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు సంభవించడంతో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఉద్రిక్తమైన, భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’లో రిచాఘోష్ పేరు: టీఎంసీ ఆరోపణ

ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’లో రిచాఘోష్ పేరు: టీఎంసీ ఆరోపణ

కోల్‌కత్తా, మార్చి 2: ఐసీసీ మహిళల వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యురాలైన భారత మహిళల క్రికెటర్ రిచా ఘోష్ పేరు ఫిబ్రవరి 28న విడుదల చేసిన బెంగాల్ తుది ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’(వివరాలపై సందేహం లేదా అభ్యంతరం ) కేటగిరీలో ఉంచినట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆదివారం ఆరోపించింది.

హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్

హైదరాబాద్‌లో మార్చి 8 నుంచి ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్

భాగ్యనగరంలో త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ కోసం రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత మహిళల హాకీ జట్టు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంది. అంతకుముందు స్కాట్లాండ్ జట్టు కూడా నగరానికి చేరుకున్నాయి.

డచ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్: షైనా మణిమత్తుకు కాంస్యం

డచ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్: షైనా మణిమత్తుకు కాంస్యం

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై భారత్‌కు చెందిన వర్ధమాన క్రీడాకారిణి షైనా మణిముత్తు మెరిసింది. ప్రతిష్ఠాత్మక 'డచ్‌ జూనియర్‌ ఇంటర్నేషనల్‌' టోర్నీలో ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

టీ20 ప్రపంచకప్: సంజూ సూపర్ ఇన్నింగ్స్.. సెమీస్‌కు భారత్

టీ20 ప్రపంచకప్: సంజూ సూపర్ ఇన్నింగ్స్.. సెమీస్‌కు భారత్

కోల్‌కతా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన కీలక సూపర్-8 పోరులో సంజూ (97 నాటౌట్; 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచితంగా పోరాడటంతో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ‘సంబరాల ఏటిగట్టు’ క్లైమాక్స్‌

కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ‘సంబరాల ఏటిగట్టు’ క్లైమాక్స్‌

మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఎస్‌.వై.జి (సంబరాల ఏటిగట్టు)’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు రోహిత్‌ కె.పి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రస్తుతం హైదరాబాద్‌లో తన కీలకమైన క్లైమాక్స్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. దాదాపు 35 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో సినిమాలోని అత్యంత కీలకమైన పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క క్లైమాక్స్ కోసమే నిర్మాతలు ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నేడు ‘సూర్య 46’.. టైటిల్, ఫస్ట్ లుక్

నేడు ‘సూర్య 46’.. టైటిల్, ఫస్ట్ లుక్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సూర్య 46’ గురించి చిత్రబృందం క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మార్చి 2న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

యుద్ధం నీడలో దుబాయ్: పీఎం మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్

యుద్ధం నీడలో దుబాయ్: పీఎం మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల మధ్య దుబాయ్‌లో క్షిపణి, డ్రోన్ దాడులతో భయాందోళనలు నెలకొన్నాయి. నటుడు విష్ణు మంచు పరిస్థితులను వెల్లడించగా, విమానాలు రద్దు కావడంతో చిక్కుకున్న సోనాల్ చౌహాన్ సురక్షితంగా భారత్ చేరేందుకు ప్రధాని మోదీ సాయం కోరారు.

మార్చి 25న ఉత్తర అమెరికాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీమియర్స్

మార్చి 25న ఉత్తర అమెరికాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీమియర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉత్తర అమెరికా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్ర ఓవర్సీస్ పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిర సినిమాస్’ కైవసం చేసుకుంది. ఇప్పటికే పవర్‌స్టార్ నటించిన ‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్థ వరుసగా మూడవసారి ఆయనతో జతకట్టడం విశేషం. ఈ మేరకు విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్రీన్ గ్లాసెస్ ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తుండగా శ్రీలీల ఆశ్చర్యంగా ఆయన వైపు చూడటం అభిమానులను ఆకట్టుకుంటోంది.

రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించిన రష్మిక

రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించిన రష్మిక

ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న ఆదివారం జూబిలీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి విచ్చేసి, సీఎం ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తన వివాహ రిసెప్షన్‌కు సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నటుడు విజయ్ దేవరకొండతో ఆమె వివాహం అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. వివాహానంతరం హైదరాబాద్‌లో మార్చి 4న జరగనున్నతన రిసెప్షన్ కు రావాలని కోరుతూ ముఖ్యమంత్రి సతీమణి గీత రెడ్డికి రష్మిక స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

క్రీడలు

భయానక అనుభవం… కానీ ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం: పీవీ.సింధు

భయానక అనుభవం… కానీ ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం: పీవీ.సింధు

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుడు సంభవించడంతో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఉద్రిక్తమైన, భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’లో రిచాఘోష్ పేరు: టీఎంసీ ఆరోపణ

ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’లో రిచాఘోష్ పేరు: టీఎంసీ ఆరోపణ

కోల్‌కత్తా, మార్చి 2: ఐసీసీ మహిళల వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యురాలైన భారత మహిళల క్రికెటర్ రిచా ఘోష్ పేరు ఫిబ్రవరి 28న విడుదల చేసిన బెంగాల్ తుది ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’(వివరాలపై సందేహం లేదా అభ్యంతరం ) కేటగిరీలో ఉంచినట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆదివారం ఆరోపించింది.

సినిమాలు

కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ‘సంబరాల ఏటిగట్టు’ క్లైమాక్స్‌

కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ‘సంబరాల ఏటిగట్టు’ క్లైమాక్స్‌

మెగా మేనల్లుడు సాయిదుర్గా తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఎస్‌.వై.జి (సంబరాల ఏటిగట్టు)’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు రోహిత్‌ కె.పి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, ప్రస్తుతం హైదరాబాద్‌లో తన కీలకమైన క్లైమాక్స్ షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. దాదాపు 35 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో సినిమాలోని అత్యంత కీలకమైన పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఒక్క క్లైమాక్స్ కోసమే నిర్మాతలు ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నేడు ‘సూర్య 46’.. టైటిల్, ఫస్ట్ లుక్

నేడు ‘సూర్య 46’.. టైటిల్, ఫస్ట్ లుక్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సూర్య 46’ గురించి చిత్రబృందం క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మార్చి 2న ఉదయం 10:18 గంటలకు విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

యుద్ధం నీడలో దుబాయ్: పీఎం మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్

యుద్ధం నీడలో దుబాయ్: పీఎం మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్

పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల మధ్య దుబాయ్‌లో క్షిపణి, డ్రోన్ దాడులతో భయాందోళనలు నెలకొన్నాయి. నటుడు విష్ణు మంచు పరిస్థితులను వెల్లడించగా, విమానాలు రద్దు కావడంతో చిక్కుకున్న సోనాల్ చౌహాన్ సురక్షితంగా భారత్ చేరేందుకు ప్రధాని మోదీ సాయం కోరారు.

మార్చి 25న ఉత్తర అమెరికాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీమియర్స్

మార్చి 25న ఉత్తర అమెరికాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్రాండ్ ప్రీమియర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉత్తర అమెరికా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్ర ఓవర్సీస్ పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ ‘ప్రత్యంగిర సినిమాస్’ కైవసం చేసుకుంది. ఇప్పటికే పవర్‌స్టార్ నటించిన ‘హరి హర వీర మల్లు’, ‘ఓజీ’ చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్థ వరుసగా మూడవసారి ఆయనతో జతకట్టడం విశేషం. ఈ మేరకు విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్రీన్ గ్లాసెస్ ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తుండగా శ్రీలీల ఆశ్చర్యంగా ఆయన వైపు చూడటం అభిమానులను ఆకట్టుకుంటోంది.

రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించిన రష్మిక

రిసెప్షన్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించిన రష్మిక

ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న ఆదివారం జూబిలీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి విచ్చేసి, సీఎం ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను తన వివాహ రిసెప్షన్‌కు సాదరంగా ఆహ్వానించారు. ఇటీవల ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నటుడు విజయ్ దేవరకొండతో ఆమె వివాహం అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. వివాహానంతరం హైదరాబాద్‌లో మార్చి 4న జరగనున్నతన రిసెప్షన్ కు రావాలని కోరుతూ ముఖ్యమంత్రి సతీమణి గీత రెడ్డికి రష్మిక స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

తొలి పలుకు - తెలుగు వార్తలు & కథలు